కరణం మల్లేశ్వరి బయోపిక్

ఎప్పటి నుంచో వార్తల్లో నానుతున్న కరణం మల్లేశ్వరి బయోపిక్ సినిమా ప్రకటన వచ్చేసినట్లే. ఎమ్ వి వి బ్యానర్ పై కోన వెంకట్ కార్పొరేషన్ ఈ సినిమాను నిర్మిస్తారు. గతంలో రాజుగాడు సినిమా డైరక్ట్ చేసిన సంజన రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కు చెందిన కరణం మల్లేశ్వరి ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చి క్రీడా రంగంలో సాధించిన అసమాన విజయాలు ఎలా సాధించింది అన్నది ఈ బయోపిక్ లో చూపిస్తారు. అదే జిల్లా నుంచి వచ్చిన మహిళా దర్శకురాలు సంజన రెడ్డ్ ఈ సినిమాకు మాంచి స్క్రిప్ట్ తయారుచేసి, దర్శకత్వం వహిస్తారు.

గతంలో ఎమ్ వి వి బ్యానర్ మీద శంకరాభరణం, గీతాంజలి తదితర సినిమాలను ఎమ్ వి వి సత్యనారాయణ నిర్మించారు. ఆయన విశాఖ నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.