విజయేంద్ర ప్రసాద్ కథకు రెండు కండిషన్స్ పెట్టిన కరీనా కపూర్

విజయేంద్ర ప్రసాద్ కు బాలీవుడ్ లో మంచి పేరుంది. భజరంగి భాయిజాన్ వంటి అద్భుతమైన కథ ఇచ్చాడన్న రెపుటేషన్ ఉంది విజయేంద్ర ప్రసాద్ కు. అందులోనూ ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మక చిత్రానికి కథ అందివ్వడంతో ఆయనకు మళ్ళీ డిమాండ్ పెరిగింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో విజయేంద్ర ప్రసాద్ సీత అనే మైథలాజికల్ డ్రామాకు కథ అందిస్తున్నాడు. రామాయణాన్ని సీత కోణంలో చెప్పే ప్రయత్నమే ఈ ప్రాజెక్ట్. కరీనా కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం సైన్ చేసే ముందు కరీనా రెండు కండిషన్స్ పెట్టినట్లు సమాచారం.

మొదటిది సీత సినిమా మొదలుపెట్టడానికి ముందు తనకున్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసేస్తుందిట. వీరే ది వెడ్డింగ్ 2 తో పాటు మరో బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్ పూర్తవ్వడానికి మూడు నెలల సమయం పడుతుంది.

ఇక రెండోది తనకు 12 కోట్ల రూపాయల పారితోషికం అడిగింది. ఈ రెండిటికీ సీత నిర్మాతలు ఎస్ చెప్పారు కూడా.