బాప్ రే! స్టార్ హీరోయిన్లకు కరోనా.. టెన్షన్ లో ఫ్రెండ్స్ గ్యాంగ్!

సెకండ్ వేవ్ ఒక ఊపు ఊపు వెళ్లింది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు బెంబేలెత్తించాయి. ఇప్పుడు థర్డ్ వేవ్ అన్న సంకేతంపై చర్చ సాగుతోంది. ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు చాపకింద నీరులో ఒక్కొక్కటిగా పెరుగుతుంటే భయం కూడా పెరుగుతోంది.

ఇదిలా ఉంటే ఇద్దరు స్టార్ హీరోయిన్లు ఒకేసారి కరోనా వైరస్ భారిన పడ్డారు. బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్ – అమృతా అరోరా లకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు బాలీవుడ్ నటీమణులు ఇటీవల ముంబైలో కోవిడ్ ప్రోటోకాల్ లను పాటించకుండా చాలా పార్టీలకు హాజరయ్యారని తెలిసింది. వారు చాలా మంది వ్యక్తులను కలిసారని తేలడంతో అందరిలో ఒకటే అందోళన నెలకొంది.

కరీనా కపూర్ – అమృతా అరోరా సన్నిహిత స్నేహితులతో కలిసి తరచుగా పార్టీలు చేసుకుంటారు. ఇటీవల ఇద్దరు స్నేహితులు ముంబైలో కరిష్మా కపూర్ -మలైకా అరోరాతో షికార్లు చేస్తూ కనిపించారు. తాజా సమాచారం మేరకు… ముంబై బృహన్ మున్సిపల్ కార్పొరేషన్ (BMC) కరీనా – అమృతతో పరిచయం ఉన్న వ్యక్తులను RTPCR పరీక్షకు హాజరుకావలసిందిగా కోరింది.

భామలిద్దరూ COVID నిబంధనలను ఉల్లంఘించారు. అనేక పార్టీలకు హాజరయ్యారు. అందుకే ఇద్దరు నటులతో పరిచయం ఉన్న వ్యక్తులను RT-PCR పరీక్ష చేయించుకోవాలని BMC ఆదేశించింది. ఇటీవల ప్రముఖ నటుడు కమల్ హాసన్ కోవిడ్ -19 నుండి కోలుకున్నారు. నవంబర్ 22న కమల్ హాసన్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని సమాచారం.