పాదయాత్రలపై కేటీఆర్‌ వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ మరియు బీజేపీలు అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లు రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు సిద్దం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు పాద యాత్ర చేయబోతున్నట్లుగా వస్తున్న వార్తల నేపథ్యంలో కేటీఆర్ తనదైన శైలిలో స్పందించాడు.

ఇటీవల ఒక కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. పాద యాత్రలు చేయబోతున్న వారందరికి కూడా స్వాగతం. పాదయాత్ర వల్ల అందరి ఆరోగ్యం బాగు పడుతుంది. అంతే తప్ప తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ ను దించడం మాత్రం వారి తరం కాదు అంటూ కేటీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఏనుగులు రోడ్డున వెళ్తుంటే కొందరు మొరుగుతూ ఉంటారు. అలాంటివి పట్టించుకునే తీరిక మాకు అస్సలు లేదు అంటూ కేటీఆర్ చెప్పుకొచ్చాడు.