తెలుగు లూసీఫర్‌లో ఖుష్బు నిజమేనా?

తెలుగులో మలయాళ హిట్‌ చిత్రం లూసీఫర్‌ ను రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సాహో దర్శకుడు సుజీత్‌ ఆధ్వర్యంలో స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాని త్వరలోనే లూసీఫర్‌ చిత్రం తెలుగు రీమేక్‌ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. లూసీఫర్‌ చిత్రంలో కీలక పాత్రలో మంజు వారియర్‌ నటించిన విషయం తెల్సిందే.

తెలుగులో ఆ పాత్రను ఎవరితో చేయిస్తారు అనేది గత కొన్నాళ్లుగా మీడియాలో చర్చ జరుగుతోంది. పలువురు సీనియర్‌ హీరోయిన్స్‌ పేర్లు ప్రస్థావనకు వచ్చాయి. తాజాగా మరో హీరోయిన్‌ పేరు ప్రచారం జరుగుతోంది. ఖుష్బును చిరంజీవి చెల్లి పాత్రలో నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నాయట. స్వయంగా చిరంజీవి ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులకు సలహా ఇవ్వగా ఆమెకు కథను చెప్పేందుకు సుజీత్‌ రెడీ అయ్యాడట.

తెలుగు వర్షన్‌ కోసం చాలా మార్పులు చేర్పులు చేశారు. చివరకు సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం సగానికి పైగా మార్చారు. అందుకే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఉన్నాయి. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ చేసిన ఈ సినిమా మెగాస్టార్‌కు అద్బుతంగా సెట్‌ అవుతుంది అనేది మెగా ఫ్యాన్స్‌ నమ్మకం. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. మరి లూసీఫర్‌ లో చిరుకు చెల్లి పాత్రలో ఎవరు నటిస్తారు అనేది షూటింగ్‌ ప్రారంభ సమయంకు తేలే అవకాశం ఉంది.