మళ్లీ మహర్షి పెయిర్?

హీరో మహేష్ బాబు సినిమా ప్రకటన మరో రెండు రోజుల్లో రాబోతోంది. టైటిల్ ఇప్పటికే బయటకు వచ్చింది. సర్కారు వారి పాట అన్నది టైటిల్ గా గట్టిగా వినిపిస్తోంది. టైటిల్ లో కూడిన అనౌన్స్ మెంట్ 31న వచ్చే అవకాశం వుంది. అయితే హీరోయిన్ ఎవరు? అన్నది క్వశ్చను. కియారా అద్వానీ పేరు వినిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్ కోసం చూస్తున్నారని తెలుస్తోంది.

కియారా అద్వానీ కాకపోతే ఈ జాబితాలో చాలా పేర్లు వినిపిస్తున్నా, పూజా హెగ్డే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే మహర్షి సినిమాలో మహేష్-పూజా కలిసి నటించారు. అలాగే కియారా కూడా గతంలో మహేష్ తో ఒక సినిమా లో నటించింది. పూజా కనుక ఫైనల్ అయితే ‘సర్కారు వారి పాట’ సినిమాకు ఓ స్పెషాలిటీ వస్తుంది.

అదేంటీ అంటే హీరో, డైరక్టర్ తప్ప మిగతా టీమ్ అంతా అల వైకుంఠపురములొ టీమ్ నే అవుతుంది. సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్, మ్యూజిక్ డైరక్టర్ థమన్ ఇప్పటికే ఫిక్స్ అయ్యారు. థమన్ పేరు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ, ఫిక్స్ అయిపోయినట్లే.