సర్కారు వారి మహేష్ ఇప్పుడేం చేస్తున్నాడంటే..!

మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భారీ అంచనాల నడుమ ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2020 సంవత్సరం తర్వాత మహేష్ బాబు నుండి ఇప్పటి వరకు సినిమా రాలేదు.

సరిలేరు నీకెవ్వరు అంటూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు మళ్లీ ఇన్నాళ్లకు సర్కారు వారి పాట సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క మహేష్ బాబు అభిమాని తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ… వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని యూనిట్ సభ్యులు తెలియజేస్తున్న నేపధ్యంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ప్రస్తుతం మహేష్ బాబు పై కీలకమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్టింగు లో నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ యాక్షన్ సన్నివేశం తర్వాత మరో సారి కీర్తి సురేష్ తో మహేష్ బాబు జాయిన్ అవుతాడు. వీరిద్దరి కాంబినేషన్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ అలాగే ఒక పాట షూటింగ్ తో సినిమా పూర్తి అవుతుందని యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మహేష్ బాబు తదుపరి సినిమా పే త్రివిక్రమ్ దర్శకత్వం లో చేయాల్సి ఉంది. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.

త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు ల కాంబోలో చాలా కాలం తర్వాత సినిమా రాబోతున్న నేపథ్యంలో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సర్కారు వారి పాట మరియు మహేష్ త్రివ్రికమ్ ల సినిమాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా సమ్మర్ కానుకగా మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేయబోతున్న సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఆ రెండు సినిమాల తర్వాత మహేష్ బాబు మోస్ట్ వెయిటింగ్ మూవీ లో నటించబోతున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక సినిమా అంటూ గత కొన్ని సంవత్సరాలు ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు వచ్చే ఏడాది లో మొదలు అయ్యే అవకాశం ఉందంటూ సమాచారం అందుతోంది. మరీ ఎక్కువ సమయం తీసుకోకుండా రాజమౌళి ఆ సినిమాను పూర్తి చేస్తాడట.