మహేష్ బాబుకి సరికొత్త లవ్ స్టోరీ కావాలట.!

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత 3 నెలల గ్యాప్ తీసుకుందామనుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి కరోనా ఎఫెక్ట్ వలన ఆ హాలిడే మరో 3 నెలలు పొడిగించినట్టయ్యింది. వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ ఆగింది, పరశురామ్ మహేష్ బాబు కోసం కథ ప్రిపేర్ చేస్తున్నాడు అనే వార్త ఉన్నప్పటికీ, ఎక్కడా ఖరారు చేయకపోవడంతో మహేష్ తదుపరి సినిమా విషయంలో అభిమానులంతా ఆందోళనలో ఉన్నారు.

తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. మహేష్ బాబుకి పరశురామ్ చెప్పిన కథ నచ్చింది.. కానీ కథా పరంగా ఎక్కువ భాగం అబ్రాడ్ లో షూట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఈ ఏడాది అబ్రాడ్ లో షూటింగ్ అంటే చాలా చాలా కష్టం. అందుకే మహేష్ బాబు ఆ కథని పక్కన పెట్టి లోకల్ లో తీయగలిగే ఓ పురే ప్యూర్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ రాయమని చెప్పారట. ప్రస్తుతం ఆ పనిలో పరశురామ్ ఉన్నాడని సమాచారం.

‘గీత గోవిందం’తో ప్రేమకథని అద్భుతంగా చెప్పిన పరశురామ్ మహేష్ కోసం న్యూ ఏజ్ లవ్ స్టోరీ రాసే పనిలో ఉన్నారట. అన్నీ ఓకే అయితే కృష్ణ గారి బర్త్ డే కానుకగా మే 31న ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేయనున్నారు. మహేష్ బాబు తదుపరి సినిమాపై కచ్చితమైన నిర్ణయం తెలియాలంటే అప్పటి వరకూ ఆగాల్సిందే.