NBK ఫ్యాన్స్ SSMB ఫ్యాన్స్ స్నేహానుబంధం!

నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా టీజర్ ట్రైలర్ సహా ప్రతిదీ ఉత్కంఠను పెంచగా ఓపెనింగ్ డే రికార్డుల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ సినిమా దాదాపు 55కోట్ల మేర బిజినెస్ సాగించగా 60కోట్ల షేర్ వసూళ్లు లక్ష్యంగా బరిలో దిగిందని కథనాలొచ్చాయి. కాసేపట్లో రివ్యూలు రానున్నాయి.

నేడు రిలీజైన ఈ చిత్రానికి ఆల్ ఇ బెస్ట్ చెబుతూ ఘట్టమనేని మహేష్ అభిమానులు ట్విట్టర్ లో ప్రచారం చేయడం ఆసక్తికరం. నందమూరి హీరోకి మహేష్ ఫ్యాన్స్ బాసటగా నిలిచారు. ఇంకా స్పెషల్ షో రన్ అవుతుండగానే అన్నీ గుడ్ థింగ్స్! అంటూ మహేష్ ఫ్యాన్స్ పాజిటివ్ గా బూస్ట్ ఇచ్చారు. ఇది ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా `సర్కారు వారి పాట`కోసం నందమూరి ఫ్యాన్స్ ట్వీట్లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. చిత్రీకరణ క్లైమాక్స్ లో ఉంది. రిలీజ్ కి ఏప్రిల్ వరకూ వాయిదా పడటంతో టీమ్ నెమ్మదిగానే షూటింగ్ చేస్తోంది. పాన్ ఇండియా చిత్రాల హడావుడి కూడా ఈలోగా క్లియర్ అయిపోతుందని సర్కారు వారు వెనక్కి తగ్గి నెమ్మదిగా కదులుతున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ మోకాలికి గాయమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగానే బాలయ్య ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.

సర్కార్ వారి యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా అదుపు తప్పి మహేష్ మోకాలికి గాయమైనట్లు తెలుస్తోంది. దీనికి చిన్న సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారుట. వచ్చే వారం హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో ఈ సర్జరీ జరగనుంది.వాస్తవానికి ఈనెలాఖరుకు `సర్కారు వారి పాట` షూటింగ్ మొత్తం పూర్తిచేసి మహేష్ -త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాల్సి ఉంది. కానీ వీలు పడలేదు. మహేష్ సినిమా రిలీజ్ కి ఇంకా చాలా సమయం ఉన్నా ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాల్లో సందడి చేశారు. అఖండ కోసం మహేష్ ఫ్యాన్స్.. సర్కార్ వారి కోసం బాలయ్య ఫ్యాన్స్ ప్రచారం చేయడం ఉత్కంఠను కలిగించేదే. ఇటీవల `మా` ఎన్నికల్లో మంచు విష్ణు- ఎన్.బి.కే వర్గానికే ఘట్టమనేని హీరోలు మద్ధతిచ్చారన్నది బహిరంగ రహస్యం. NBK ఫ్యాన్స్ SSMB ఫ్యాన్స్ స్నేహానుబంధం! ఆసక్తిని కలిగిస్తోంది.