తెలంగాణ తెలుగు పాఠాలు నేర్చుకుంటున్న మంచు లక్ష్మి

మంచు లక్ష్మి తెలుగు మాట్లాడితేనే చాలా విచిత్రంగా వింతగా ఉంటుంది. హీరోయిన్స్ తెలుగు కంటే ఎక్కువగా ఆమె తెలుగు సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. ఆమె తెలుగు విషయంలో రకరకాలుగా విమర్శలు ఎదుర్కొంది. ప్రస్తుతం ఈమె పిట్ట కథలు అనే వెబ్‌ సిరీస్ లో నటిస్తుంది. ఇది లస్ట్‌ స్టోరీస్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే. ఈ వెబ్‌ సిరీస్ లో మంచు లక్ష్మి ఒక రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించబోతుంది. ఆమె తెలంగాణ యాసలో మాట్లాడుతుందని అంటున్నారు.

తెలంగాణ యాస కోసం ఆమె దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ వద్ద పాఠాలు నేర్చుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డబ్బింగ్‌ కోసం ఈమె తెలంగాణ యాసపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సాదారణ తెలుగుతోనే ఈమె కుస్తీ పడుతుంది. అలాంటిది తెలంగాణ యాసలో తెలుగు మాట్లాడితే ఎలా ఉంటుందా అంటూ ఇప్పటి నుండే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.