మంచు వారి అమ్మాయి వ్యాక్సినేషన్‌ పై విమర్శలు

మంచు లక్ష్మి ఏం చేసినా చిరిగి చాట అంత అవుతుంది. ఆమె చిన్న వీడియో పెట్టినా లేదా చిన్న విషయాన్ని షేర్‌ చేసినా కూడా ఆ విషయాన్ని అటు తిప్పి ఇటు తిప్పి రకరకాలుగా చూసి కొందరు ట్రోల్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచు లక్ష్మి తాజాగా హైదరాబాద్‌ యశోద ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ ను తీసుకున్నారు. ఆమె వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం మే 1 వ తారీకు నుండి 45 లోపు వారికి కూడా వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. కాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 45 లోపు వారికి ఇవ్వడం లేదు, అలాగే 15వ తారీకు వారికి మొదటి డోసు ఇవ్వడం లేదు అంటూ అధికారికంగా ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంత కఠినంగా చెప్పినా కూడా మంచు లక్ష్మి ఎలా మొదటి డోసు వ్యాక్సిన్‌ తీసుకుంది. ఆమెకు ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ లభించింది అంటూ ప్రశ్నిస్తున్నారు. సెలబ్రెటీ అవ్వడం వల్లే ఆమెకు వ్యాక్సిన్‌ దక్కిందా అంటూ విమర్శలు చేస్తున్నారు. సెలబ్రెటీల ప్రాణాలకు మాత్రమే ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందా అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మంచు లక్ష్మి వయసు 43 ఏళ్లు. ఆమె ఈ సమయంలో వ్యాక్సిన్‌ తీసుకోవడం విమర్శలకు తావిస్తుంది.