మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన సందర్భంగా మెగా ఫ్యామిలీలో, అభిమానుల్లో సందడి నెలకొంది. ‘ఖైదీ నంబర్ 150’ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ల ముందు చిరు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. చిరు మేనల్లుడు, సినీనటుడు అల్లు అర్జున్ ఈరోజు తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ ఆ సినిమాను చూశారు. దర్శకుడు హరీష్ శంకర్ కూడా అల్లు అర్జున్ బాటలోనే నడిచారు. వారిద్దరితో పాటు పలువురు సినీ ప్రముఖులు చిరంజీవి సినిమాపై ట్వీట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు.
‘అమ్మడు! లెట్స్ డు రికార్డ్స్ కుమ్ముడు!’ అంటూ అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘బాక్సాఫీసులు బద్దలు.. అన్ని ఏరియాలనూ రఫ్ అడిస్తున్న మెగాస్టార్..’ అని హరీశ్శంకర్ ట్వీట్ చేశాడు. మరోవైపు అల్లు శిరీష్ ఏకంగా ‘మెగా సర్జికల్ స్ట్రయిక్’ అని ట్వీట్ చేశాడు.
మరోవైపు చిరు తనయుడు, ఈ సినిమా నిర్మాత రాంచరణ్ కూడా దంచేస్తున్నాడు. హైదరాబాద్ ఫేస్ బుక్ ఆఫీస్ నుంచి అరగంటకు పైగా లైవ్ ఇచ్చాడాయన. ఆ ఎపిసోడ్ మొత్తం తన ఫేస్ బుక్ పేజిలో లైవ్ టెలికాస్టు చేశాడు కూడా. చిరు గురించి.. చెర్రీ గురించి ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి.. డిస్కషన్ లో పాల్గొన్న చరణ్.. ఆ తర్వాత ఈవెంట్లో పాల్గొన్న నలుగురు అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేశాడు. మొత్తానికి చిరు 150వ సినిమా అందరిలోనూ కొత్త జోష్ నింపుతోంది.