ఎన్ని రోజులు పూలు పెడతారు బాబూ..!

ఏపీ సీఎం చంద్రబాబుకు కాపు నేత ముద్రగడ మరోసారి ఘాటు లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లతో చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు ముద్రగడ. కాపులకు కాపులతోనే తిట్టిస్తున్నారని, ఇంతకంటే దారుణం మరొకటి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కాపు జాతి రిజర్వేషన్లు అడగలేదని, సీఎం చంద్రబాబే తన ఎన్నికల పబ్బం గడుపు డుపుకోవడానికి రిజర్వేషన్ల చిచ్చు రాజేశారన్నారు. ఇప్పుడు ఇచ్చిన మాట తప్పి, ఆశపెట్టి నిరాశ చెందేలా చేస్తున్నారని మండిప్డడారు ముద్రగడ. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ఉద్యమం ఆగదన్నారు.

ఇప్పటికే తునిలో కాపు గర్జన పేరుతో ఏపీ సర్కారును భయపెట్టిన ముద్రగడ.. ఇప్పుడు మళ్లీ లేఖ రాయడంతో.. ప్రభుత్వం జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తోంది. ఈసారి కాపు గర్జన తరహా రచ్చ జరగకుండా అన్నిరకాల ముందుజాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

తనను తిట్టడం కోసమే కాపు నేతలను, కాపు కార్పొరేషన్ ను ఏర్పాటుచేశారన్న ముద్రగడ మాటలు.. మరోసారి చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు ఓవైపు మంజునాథ కమిషన్ వేసిన తర్వాత కూడా ముద్రగడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే.. ఏపీలో మళ్లీ అగ్గి రాజుకుంటుందేమోనని విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.