లవ్ స్టోరీ కథపై భారీ అంచనాలు… మరోసారి శేఖర్ కమ్ముల!!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ చిత్రం మంచి అంచనాలను సృష్టించుకోగలిగింది. ఆ కాంబినేషన్ కు తోడు శేఖర్ కమ్ముల దర్శకత్వం కావడంతో ఒక వర్గం ప్రేక్షకులు పాజిటివ్ గా ఉన్నారు. సెప్టెంబర్ 10న ఈ చిత్రం విడుదల కావాల్సింది కానీ ప్రస్తుత పరిస్థితులు, అదే రోజున ఓటిటిలో టక్ జగదీష్ విడుదల కావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని లవ్ స్టోరీని వాయిదా వేశారు.

వచ్చే నెలలో లవ్ స్టోరీ విడుదలవుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే లవ్ స్టోరీ కథపై రూమర్స్ వస్తున్నాయి. శేఖర్ కమ్ముల మరోసారి భావోద్వేగ ప్రేమకథతోనే వస్తున్నా కానీ ఈసారి మరింత స్ట్రాంగ్ పాయింట్ ను తీసుకున్నాడని అంటున్నారు.

రూరల్ బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన హీరో హీరోయిన్లు హైదరాబాద్ వంటి మహా నగరంలో ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఇందులో సాయి పల్లవి పాత్రపై అత్యాచార ప్రయత్నం కూడా జరుగుతుందిట. మరి వీటిపై క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ వరకూ ఎదురుచూడాల్సిందే.