నెవ్వర్ ఎండింగ్ ‘లవ్ స్టోరీ’?

శేఖర్ కమ్ముల చెక్కుడే అలా వుంటుంది. ఆయన సినిమా తీయడం మొదలుపెడితే తీస్తూనే వుంటారు. నిర్మాత చూస్తూనే వుండాలి. అంతా అయ్యేంత వరకు అసలు ఆయన ఏం చేస్తున్నారో కూడా అంత సులువుగా అంతు పట్టదు. పైగా నిర్మాతకు కూడా ఏమీ చెప్పరు. మాట వినరు అని టాక్ కూడా వుంది.

బహుశా అందుకే కావచ్చు. ఇంతమందితో రిపీటెడ్ గా సినిమాలు చేసే నిర్మాత దిల్ రాజు ఫిదా తరువాత మళ్లీ శేఖర్ కమ్ములతో జత కట్టలేదు. ఏషియన్ సునీల్ తొలిసారి నిర్మాతగా మారి శేఖర్ కమ్ములతో కలిసి లవ్ స్టోరీ సినిమా స్టార్ట్ చేసారు. చాలా వరకు తీసి, దాన్ని బుట్టలో పడేసి, హీరో హీరోయిన్లను మార్చేసి మళ్లీ మొదలుపెట్టారు.పల్లెలో కింద తరగతి అనుకునే కుటుంబపు అమ్మాయి, పై తరగతి అబ్బాయి. తీరా పట్నం వచ్చేసరికి ఆ అమ్మాయి దగ్గర ఈ అబ్బాయి పనిచేయడం లాంటి లైన్ ఎంచుకుని చేస్తున్న లవ్ స్టోరీ అని టాక్ వుంది.

ఇప్పటికి రెండు విడుదల డేట్ లు మారాయి. కరోనా పుణ్యమా అని ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఈ సంగతి అలా వుంచితే ఇప్పటి వరకు తీసిన రష్ ను హీరో చైతన్య తన భార్య సమంత తో కలిసి చూసినట్లు ఇండస్ట్రీలో గ్యాసిప్ వినిపిస్తోంది. నిజమెంతో కానీ చైతన్య కాస్త అసంతృప్తిగా వున్నట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు సినిమా ఎక్కువగా హీరోయిన్ మీద వుందని బోగట్టా.

అయితే శేఖర్ కమ్ముల ప్రొడక్ట్ ఫైనల్ కట్ అయ్యేవరకు ఎవ్వరికీ అంచనా చిక్కదు. ఫిదా మీద కూడా దిల్ రాజు ఆశలు వదులుకునే విడుదల చేసారు. కానీ సాయిపల్లవి మ్యాజిక్ వర్కవుట్ అయింది. ఆయనకు బంగారు పంట పండింది. అందువల్ల ఆసియన్ సునీల్ కు కూడా ఆలస్యంగా అయినా బంగారు పంట పండుతుందేమో చూడాలి.

కానీ సమస్య ఏమిటంటే ఇది పూర్తయితే కానీ,విక్రమ్ కే కుమార్, ఆపై ఇంద్రగంటి సినిమాలు స్టార్ట్ కావు.