ఉదయ్‌పూర్‌లో నాగబాబు ఫ్యామిలీ క్వారెంటైన్‌

మెగా ఫ్యామిలీ వేడుకకు అంతా సిద్దం అవుతుంది. కరోనా కాలంలో పలువురు సెలబ్రెటీల వివాహాలు అయ్యాయి. అయితే వారికి కాస్త సాదా సీదాగా అయ్యాయి. కాని మెగా డాటర్‌ నిహారిక వివాహం మాత్రం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆమె కోరిక మేరకు కుటుంబ సభ్యులు డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేశారు. ఈ వివాహంను రాజస్థాన్‌లోని ఉదయ్‌ పూర్‌లో నిర్వహిస్తున్నారు. నాగబాబు తన కూతురు వివాహంను అత్యంత వైభవంగా చేయాలని కలలు కన్నాడు. అన్నట్లుగానే ఆమె కోరుకున్నట్లుగా నిర్వహించబోతున్నాడు.

వచ్చే నెలలో జరుగబోతున్న వెడ్డింగ్‌ కు కరోనా జాగ్రత్తలు అన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా వధువు మరియు వరుడి కుటుంబ సభ్యులు అంతా కూడా రెండు వారాల పాటు క్వారెంటైన్‌ లో ఉండాల్సి ఉంది. ఎందుకంటే పెళ్లికి వచ్చిన అథితుల నుండి కంటే పెళ్లి పెద్దలు పెళ్లి కుటుంబంకు చెందిన వారి నుండి కరోనా ఎక్కువ మంది సోకే అవకాశం ఉంటుంది. అందుకే మొదటగా వారిని క్వారెంటైన్‌ లో ఉండాల్సిందిగా కొందరు సూచించారట.

ఆ కారణంగానే నాగబాబు ఫ్యామిలీ మొత్తం కూడా రెండు వారాల ముందే ఉదయ్‌ పూర్‌ వెళ్లి అక్కడ క్వారెంటైన్‌ ఉండబోతున్నారట. చైతన్య ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా క్వారెంటైన్‌కు సిద్దంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన వివరాలు త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.