సమ్మర్ ను టార్గెట్ చేసిన అక్కినేని హీరోలు

అక్కినేని ఫ్యామిలీ నుండి ప్రస్తుతం యాక్టివ్ గా సినిమాలు చేస్తోంది నాగార్జున, నాగ చైతన్య అండ్ అఖిల్. ఈ ఏడాది వీరి ముగ్గురి నుండి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే ఇప్పుడు వీరు నటించిన సినిమాలు మాత్రం షూటింగులను ముగించుకుని నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి.

నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటించగా, నాగ చైతన్య లవ్ స్టోరీ షూటింగ్ ను పూర్తి చేసాడు. ఇక తొలి హిట్ కోసం ఎదురుచూస్తోన్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూడు చిత్రాలపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్న విషయం తెల్సిందే.

ఇక తాజా సమాచారం ప్రకారం అక్కినేని హీరోలు ముగ్గురూ కూడా తమ సినిమాలను సమ్మర్ కే విడుదల చేయాలని భావిస్తున్నారు. నిజానికి వైల్డ్ డాగ్, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రాలు 2020 సమ్మర్ కు విడుదల కావాలి కానీ ఇప్పుడు కరోనా కారణంగా ఒక ఏడాది ఆలస్యంగా విడుదలవుతాయి.