14 రోజులే మిగిలాయి.. ఉరి ఎప్పుడు సీఎం గారు?

తెలుగు దేశం పార్టీ నాయకుడు నారా లోకేష్‌ మరో సారి సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఏపీలో నడి రోడ్డు మీద హత్యకు గురి అయిన రమ్య కు న్యాయం చేయాలని.. హత్యకు గురి అయిన వాడిని వెంటనే శిక్షించాలంటూ తెలుగు దేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. తెలుగు దేశం పార్టీ నాయకుడు లోకేష్ ఈ విషయమై 21 రోజుల టైమ్ పెట్టిన లోకేష్ ప్రతి రోజు ఆ విషయై గుర్తు చేస్తూ ఉన్నాడు.

తాజాగా మరో సారి ఆ విషయమై నారా లోకేష్‌ స్పందిస్తూ ఏపీ మహిళ పోలీసులను నా మీద ఉసిగొల్పడంలో పడ్డ శ్రమ మహిళల రక్షణ కోసం పెట్టి ఉంటే ఖచ్చితంగా రోజుకో ఆడబిడ్డ బలై ఉండేది కాదు జగన్‌ గారు. ఇప్పటికైనా రాజకీయ కక్ష సాధింపులు పక్కన పెట్టి మహిళల భద్రతపై దృష్టి పెట్టాలి. ఇక మిగిలి ఉంది 14 రోజులే. విద్యావంతురాలైన రమ్యను హత్య చేసిన వాడికి ఉరి ఎప్పుడు సీఎం గారు అంటూ లోకేష్ ట్వీట్ చేశాడు.