బ్రేకింగ్: పెను ప్రమాదం నుంచి బయటపడ్డ నారా లోకేశ్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న లోకేశ్ పశ్చిమ గోదావరి జిల్లా వెళ్లారు. ఈ సందర్భంగా ఆకివీడు వెళ్లిన లోకేశ్ స్ధానిక పార్టీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి ట్రాక్టర్ పై వెళ్లారు.

ఈ సమయంలో లోకేశ్ ట్రాక్టర్ నడుపుతున్నారు. ఒక్కసారిగా ట్రాక్టర్ పక్కనే కాల్వ వైపు ఒరిగింది. అయితే.. ఆయన వెంటనే తేరుకుని ట్రాక్టర్ ను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

తన పర్యటనలో భాగంగా కృష్ణా జిల్లా కైకలూరులో పర్యటన ముగించుకుని పశ్చిమ గోదావరి వెళ్లారు లోకేశ్. వరద బాధితుల్ని ,పంట కోల్పోయిన రైతులను పరామర్శించేందుకు లోకేశ్ ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగానే ఈ ఘటన జరిగింది. దీనిపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.