సీఎం జగన్ ఓ నయా నియంత..! ప్రశ్నిస్తే చంపేస్తున్నారంటూ లోకేశ్ ఫైర్

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. ఆమధ్య 25 వేల కోట్ల లిక్కర్ మాఫియాను ప్రఃశ్నించినందుకు చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ఓం ప్రతాప్ ను చంపేశారు. ఈరోజు ఎమ్మెల్యే అన్నే రాంబాబును ప్రభుత్వ తీరుపై ప్రశ్నించిన బండ్ల వెంగయ్యనాయుడును చంపేశారు. వీటిని ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలని వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

ఏపీ సీఎం జగన్ రెడ్డి నయా నియంతలా మారారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా చంపేసి ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఈ హత్యలన్నీ ఫ్యాక్షన్ హత్యలేనని.. సీఎం జగన్ తన ఫ్యాక్షన్ నైజాన్ని నిరూపించుకుంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని, వారి రౌడీ మూకల్ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని లోకేశ్ అన్నారు. ఈమేరకు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు లోకేశ్.