దాని వల్లే మంత్రి కుమారుడి మృతి?

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే… ప్రమాదానికి కారణం తాగి వాహనం నడపడమేనని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులకు ఆధారాలు కూడా లభించినట్లు చెబుతున్నారు.

హైదరాబాదులోని జూబ్లిహిల్స్, రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన ఘటనలో నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ  మరణించారు. అయితే.. కారు ప్రమాదానికి గురైన సమయంలో నిషిత్ నారాయణ మద్యం తాగి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన కారులో నాలుగు మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి.

మరోవైపు కారు ప్రమాదానికి గురైన వెంటనే నిషిత్ నారాయణ, రవివర్మలను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయితే వర్షం కారణంగా వారి ప్రయత్నాలు అనుకూలించలేదు.  ప్రమాద వార్తను పోలీసులు, అంబులెన్స్ కు ఫోన్ చేసి చెప్పినప్పటికీ, వారు రావడం ఆలస్యమైందని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన అరగంటకు వారు సంఘటనాస్థలికి చేరుకోగా, కారులోంచి వారిని బయటకు తీసేందుకు రెండు గంటల సమయం పట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.  మొత్తానికి బాగా తాగి కారు నడపడం వల్లే ప్రమాదానికి గురైనట్లు చెబుతున్నారు.