నయనతార రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై కేసు నమోదు

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయన తార కొత్తగా వివాదంలో చిక్కుకుంది. హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె ప్రేమ విషయం కారణంగా వివాదాలను ఎదుర్కొంది. కాని నయనతార ఈ మధ్య కాలంలో ఎలాంటి వివాదాలు లేకుండా సాఫీగా కెరియర్ ని వ్యక్తిగత జీవితాన్ని సాగిస్తూ ఉంది. ఈ సమయంలో ఆమె వృత్తి పరంగా ఒక వివాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్నాళ్ళ క్రితం ప్రియుడు విగ్నేష్ శివన్ తో కలిసి ఈ అమ్మడు రౌడీ పిక్చర్స్ అనే సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది.

ఆ నిర్మాణ సంస్థ లో ఇప్పటికే పలు సినిమాలను నిర్మించింది. తన సొంత సినిమాలతో పాటు బయట వారితో కూడా సినిమాలను నయనతార మరియు ఆమె ప్రియుడు నిర్మిస్తున్నారు. తాజాగా ఆ సినిమా నిర్మాణ సంస్థ పై ఫిర్యాదు నమోదు అయింది. రౌడీ ఫిలిమ్స్ అంటూ పేరు పెట్టడంతో రౌడీయిజాన్ని ప్రేరేపించినట్లుగా వుంది అంటూ కొందరు వాదిస్తున్నారు. ఇలాంటి పేర్లు సమాజానికి మంచిది కాదు అంటూ వారు కోర్టు ను ఆశ్రయించారు. వెంటనే నయనతార తన నిర్మాణ సంస్థ మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు విచారణ జరుగుతోంది. నయనతారకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు ఏం జరగబోతుంది అనేది చూడాలి.