వైభవంగా జరిగిన నయన్‌.. విఘ్నేష్‌ల వివాహం

ఏడు సంవత్సరాల ప్రేమ బంధం ఇప్పుడు మూడు ముళ్ల బంధంగా మారింది. లేడీ సూపర్ స్టార్‌ నయనతార మరియు యువ దర్శకుడు విఘ్నేష్ శిన్ లు సుదీర్ఘ కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి పెళ్లి గురించి వార్తలు రాని రోజంటూ లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి రోజు పెళ్లి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఎట్టకేలకు నేడు వైభవంగా వీరి పెళ్లి వేడుక జరిగింది. మహాబలిపురంలోని ఒక ప్రైవేట్‌ వేదిక పై వీరిద్దరు మూడు ముళ్ల బంధంతో ఏకం అయ్యారు. ఈ పెళ్లి వేడుకలో బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుఖ్ ఖాన్‌ మరియు కోలీవుడ్‌ సూపర్ స్టార్‌ రజినీకాంత్ ఇంకా సూర్య లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

పెళ్లి తంతు మొత్తం నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ చేయడం కోసం గౌతమ్‌ వాసు దేవ్ మీనన్ అద్బుతంగా పెళ్లి తంతును చిత్రీకరించారట. మొత్తానికి పెళ్లి వైభవంగా జరిగింది. కొత్త పెళ్లి కొడుకు పెళ్లికి సంబంధించిన మొదటి ఫోటోను కూడా షేర్ చేశాడు. నయనతార ను ఎంతో ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్న ఫోటోలో ఇద్దరి ప్రేమ కనిపిస్తుంది. మూడు ముళ్ల బంధంతో విఘ్నేష్ శివన్ భార్యగా మారిన నయనతార ఆనందంతో కనిపిస్తుంది.