నిహారిక, చైతన్యల కోవిడ్ వార్తలపై నాగబాబు స్పందన

మెగా ఫ్యామిలీలో వరుసగా రామ్‌ చరణ్‌ మరియు వరుణ్‌ తేజ్ లకు కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యింది. దాంతో ఇంకా కొంత మంది మెగా ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో అందరి దృష్టి కొత్త జంట నిశ్చయ్‌ మీద ఉంది. వీరిద్దరు కరోనా పరీక్షలు చేయించుకున్నారా వారి రిపోర్ట్‌ ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు. క్రిస్మస్ సందర్బంగా వీరిద్దరు మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిశారు, వారిలో చరణ్‌ వరుణ్‌ లు కూడా ఉన్నారు.

చరణ్‌ వరుణ్‌ లకు పాజిటివ్‌ వచ్చింది కనుక కొత్త జంట కు కూడా వైరస్ పాజిటివ్‌ వచ్చి ఉంటుందని అంతా భావిస్తున్న తరుణంలో నాగబాబు స్పందించాడు. కోవిడ్‌ టెస్టు లో నిహారిక, చైతన్యలకు నెగటివ్‌ వచ్చింది. మాల్దీవులకు వెళ్లే సమయంలో మరియు వెళ్లి వచ్చే సమయంలో కూడా కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది. వారు ఇద్దరికి రెండు సార్లు కూడా నెగటివ్‌ వచ్చిందని ఈ సందర్బంగా నాగబాబు పేర్కొన్నాడు. వరుణ్‌ తేజ్‌ మరియు చరణ్‌ లకు నిశ్చయ్‌ ల నుండి కాని వారి నుండి వీరికి కాని వైరస్ వచ్చినట్లుగా నిర్థారణ అవ్వలేదని నాగబాబు పేర్కొన్నాడు.