నిహారిక ఇంట్లో నిన్న అర్థరాత్రి ఏమైంది?

మెగా డాటర్ గా సుపరిచితమైన నిహారిక ఇంట్లో నిన్న ఏం జరిగింది? బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టటమే ఒక సంచలనమైతే.. తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలు.. వెబ్ సిరీస్ లతో తన సత్తా చాటిన ఆమెకు ఈ మధ్యనే వివాహం జరిగిన సంగతి తెలిసిందే.

గుంటూరు రేంజ్ ఐటీ అధికారి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కొడుకు కమ్ బిజినెస్ మ్యాన్ అయిన వెంకట చైతన్యతో ఆమె పెళ్లి వేడుక ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగింది. అనంతరం ఈ కఫుల్ జర్నీకి సంబంధించిన పలు ఫోటోల్ని నిహారిక షేర్ చేసేది. వ్యక్తిగత విషయాలతో పాటు.. సినిమాలకు సంబంధించిన వివరాల్ని ఆమె తన పోస్టులు పెడుతూ సందడి చేస్తుంటారు. అలాంటి ఈ జంటకు సంబంధించి తాజాగా వెలుగు చూసిన ఒక వార్త షాకింగ్ గా మారింది.

ఇంతకూ జరిగిందేమంటే.. ఈ జంట బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్ మెంట్లో నివాసం ఉంటున్నారు. అయితే.. బుధవారం అర్థరాత్రి (కొంతమంది మంగళవారం అర్థరాత్రి అని చెబుతున్నారు) నిహారిక ఇంట్లో పెద్ద గొడవ జరిగినట్లుగా చెబుతున్నారు. నిహారిక భర్త చైతన్య న్యూసెన్సు చేస్తున్నారంటూ అపార్ట్ మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.
అపార్ట్ మెంట్ వాసులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో నిహారిక రివర్సులో తన భర్తపై ఇచ్చిన ఫిర్యాదుకు బదులుగా మరో ఫిర్యాదు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఇద్దరి ఫిర్యాదులపై అసలు కేసు నమోదు చేశారా? లేదా? చేస్తే.. అందులోని అంశాలేమిటి? అన్న వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇంతకీ నిహారిక ఇంట్లో గొడవ జరిగిందా? మరేమైనా ఇష్యూను ఇలా ప్రచారం చేస్తున్నారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది.