నితిన్‌, పూరి ఇంకా ఉప్పెన కలయిక!

యంగ్‌ హీరో నితిన్‌ ఇటీవలే రంగ్‌ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కీర్తి సురేష్ తో కలిసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన నితిన్ ప్రస్తుతం అంధాధున్ రీమేక్ మ్యాస్ట్రో లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నితిన్ ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం లైగర్‌ సినిమాను చేస్తున్న పూరి జగన్నాద్‌ ఆ తర్వాత నితిన్ ను డైరెక్ట్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హీరోయిన్ ను కూడా ఖరారు చేశారట.

ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా సంచలనం సృష్టించిన ముద్దుగుమ్మ కృతి శెట్టి తెలుగులో మరో ఆఫర్‌ ను దక్కించుకుంది. అదే పూరి జగన్నాద్ దర్శకత్వంలో నితిన్‌ హీరోగా నటించబోతున్న సినిమా. వీరి కాంబోకు మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కాంబోలో హార్ట్‌ ఎటాక్ వచ్చింది. అది పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా కూడా మంచి బజ్ తో వీరి సినిమా రాబోతుంది. ఇలాంటి క్రేజీ మూవీలో మోస్ట్‌ బిజీ అండ్‌ క్రేజీ హీరోయిన్ కృతి శెట్టి నటించబోతుండటం సినిమాపై అంచనాలు మరింతగా పెంచేలా ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.