నితిన్‌ రూ.50 కోట్ల మూవీ ఆగిపోయింది

యంగ్‌ హీరో నితిన్ త్వరలో ‘పవర్‌ పేట’ అనే సినిమా ను చేయబోతున్నట్లుగా అభిమానులు చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. కాస్త బడ్జెట్‌ ఎక్కువ అవ్వడం వల్ల ఆలస్యంగా మొదలు పెట్టబోతున్నాం. తప్పకుండా పవర్‌ పేట సినిమా ఒక పవర్‌ ఫుల్‌ ప్యాకేజీ మూవీగా ఉంటుంది అంటూ నితిన్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్‌ సినిమాను చేసేందుకు నితిన్‌ రెడీ అన్నట్లుగానే పలు సందర్బాల్లో పేర్కొన్నాడు. సినిమాకు 45 నుండి 50 కోట్ల వరకు బడ్జెట్‌ ఖర్చు అవుతుందని వార్తలు వచ్చాయి.

ఇక ప్రారంభమే తరువాయి అనుకుంటూ ఉన్న సమయంలో అనూహ్యంగా పవర్ పేట సినిమాను క్యాన్సిల్‌ చేసినట్లుగా నితిన్ తండ్రి.. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాల్సిన సుధాకర్‌ రెడ్డి ప్రకటించారు. విక్రమ్‌ సినిమాను పంపిణీ చేసిన ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ స్క్రిప్ట్‌ అనుకున్నట్లుగా రాకపోవడంతో పవర్ పేట సినిమాను తీయడం లేదని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం నితిన్ వరుసగా ఆయన మార్క్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు బిజీగా ఉన్నాడంటూ సుధాకర్ రెడ్డి ప్రకటించాడు.