పవన్‌ రానా మూవీ కోసం నిత్యామీనన్‌

మలయాళం సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ కోసం ఇప్పటికే సాయి పల్లవి ఎంపిక అయిన విషయం తెల్సిందే. పవన్‌ మరియు రానాలు నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరోయిన్‌ గా నిత్యామీనన్ ను ఎంపిక చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా సగం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ లో ఇద్దరు హీరోయిన్స్ నటించాల్సి ఉందట.

ఒక హీరోయిన్‌ గా నిత్యామీనన్ కనిపించబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సమయంలో సినిమా లో ట్యాలెంటెడ్‌ హీరోయిన్ నిత్యామీనన్ నటించడం వల్ల అంచనాలు మరింతగా పెరగడం ఖాయం అంటున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఈ సినిమాను సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. రానా మరియు పవన్‌ లు కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమా ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.