దువ్వాడ జగన్నాథమ్‌కి పవన్‌ ఫాన్స్‌ బూస్ట్‌

‘కాటమరాయుడు’ తర్వాత అత్యంత వేగం యాభై లక్షల వ్యూస్‌ తెచ్చుకున్న టీజర్‌గా ‘దువ్వాడ జగన్నాథమ్‌’ రికార్డ్‌ సెట్‌ చేసింది. ఇప్పటికీ రోజుకి లక్షల మంది చూస్తోన్న ఈ టీజర్‌ అసలు మేటర్‌ కంటే కొసరు విషయంతోనే ఎక్కువ ఎట్రాక్ట్‌ చేస్తోంది. ఈ టీజర్‌కి ఇప్పటికి లక్షా పదివేల లైక్‌లు వస్తే, తొంభై నాలుగు వేలకి పైగా డిస్‌లైక్‌లు వచ్చాయి. ‘చెప్పను బ్రదర్‌’ కాంట్రవర్సీ వల్ల ఈ టీజర్‌పై పవన్‌ ఫాన్స్‌ కత్తిగట్టారు.

పనిగట్టుకుని టీజర్‌ని వాళ్లు డిస్‌లైక్‌ చేస్తూ వుంటే, డిస్‌లైక్‌ల సంఖ్య లైక్‌లని దాటకుండా అల్లు అర్జున్‌ ఫాన్స్‌ జాగ్రత్త పడుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం వల్ల టీజర్‌కి వ్యూస్‌ పెరుగుతున్నాయి. ఎన్ని డిస్‌లైక్‌లు వచ్చాయంటూ చాలా మంది ఆరా తీస్తూ ఈ వీడియో లింక్‌ మళ్లీ మళ్లీ ఓపెన్‌ చేస్తూ వుండడం క్రేజ్‌కి యాడ్‌ అయింది. దీంతో మరింత వేగంగా ఈ టీజర్‌కి వ్యూస్‌ పెరుగుతున్నాయి.

డిస్‌లైక్‌ల బాధ పడలేక కామెంట్స్‌ని డిస్‌-ఏబుల్‌ చేసి, లైక్స్‌ ఆప్షన్‌ తీసేస్తారేమో అనుకున్నారు కానీ దిల్‌ రాజు తెలివిగా వ్యవహరిస్తూ ఈ నెగెటివ్‌ ప్రచారాన్ని వాడుకునేందుకు తన ఛానల్‌లో ఆ లైక్స్‌ ఆప్షన్‌ని అలాగే వుంచేసాడు. గతంలో ప్రేమమ్‌ చిత్రం ట్రెయిలర్‌కి మలయాళం ఫాన్స్‌ నుంచి ఇలాగే నెగెటివ్‌ రియాక్షన్‌ వచ్చినపుడు ఆ నిర్మాతలు వెంటనే కామెంట్స్‌ ఆప్షన్‌ తీసేసారు. కానీ దిల్‌ రాజు అలా చేయకపోవడంతో ‘దువ్వాడ జగన్నాథమ్‌’ టీజర్‌ వచ్చి నాలుగు రోజులవుతున్నా రచ్చ కంటిన్యూ అవుతోంది.