పవన్‌, రానా మూవీలో మరో విలక్షణ నటుడు

మలయాళంలో సూపర్‌ హిట్ అయిన అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ సినిమాను తెలుగులో పవన్‌ కళ్యాణ్‌ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ లో నిర్మాణం జరుగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాలో రానా మరో హీరోగా నటించబోతున్నట్లుగా కొద్ది సేపటి క్రితమే అధికారిక ప్రకటన వచ్చేసింది. వచ్చే నెల నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో మరో కీలక పాత్రకు గాను విలక్షణ నటుడు సముద్రఖనిని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

తమిళ విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న సముద్రఖని ఈ సినిమాలో రానాకు తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈయన ఈ ఏడాది అల వైకుంఠపురంలో సినిమాలో విలన్‌ గా నటించాడు. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈయన నటించనుండటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో ఈ సినిమాకు గాను పవన్‌ పారితోషికంగా తీసుకుంటున్నాడు అంటున్నారు. కేవలం రెండు నెలల లోపులోనే సినిమాను పూర్తి చేసేలా ప్లాన్‌ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు షూటింగ్‌ ప్రారంభోత్సవం సందర్బంగా ప్రకటించే అవకాశం ఉంది.