పవన్‌ ఆ సినిమా క్యాన్సిల్‌ అయినట్లేనా?

పవన్ కళ్యాణ్‌ హీరోగా వరుసగా సినిమాలు ప్రకటనలు వచ్చాయి. పింక్ సినిమా రీమేక్ వకీల్ సాబ్‌ తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే హరిహర వీరమల్లును క్రిష్‌ దర్శకత్వంలో చేస్తుండగా మలయాళం మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ ను సాగర్‌ చంద్ర దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు అలా ఉండగానే సమ్మర్‌ చివర్లో హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మైత్రి వారి నిర్మాణంలో ఒక సినిమాను పవన్ చేసేందుకు ఓకే చెప్పాడు. ఈ సినిమాలు కాకుండా గత ఏడాది రామ్ తాళ్లూరి నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాను చేసేందుకు పవన్ ఒప్పుకున్నాడు.

సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో పవన్‌ మూవీ అనుకున్నదాని ప్రకారం ఈ సమ్మర్‌ లో పట్టాలెక్కాల్సి ఉంది. కాని అనూహ్య కారణాల వల్ల సినిమా క్యాన్సిల్‌ అయ్యిందా అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సురేందర్‌ రెడ్డి ఈ ఏడాది చివరి వరకు పవన్‌ మూవీని పూర్తి చేసి ఆ తర్వాత అఖిల్‌ తో సినిమా ను పట్టాలెక్కించాలని భావించాడు. కాని మొదటే అఖిల్‌ తో సినిమాను పట్టాలెక్కించేందుకు సురేందర్ రెడ్డి ప్లాన్‌ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.