దసరా నుండి రంగంలోకి దిగనున్న భవదీయుడు భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తోన్న భీమ్లా నాయక్, హరిహర వీర మల్లు షూటింగ్ దశల్లో ఉన్న విషయం తెల్సిందే. భీమ్లా నాయక్ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఇక హరిహర వీర మల్లు 2022 సమ్మర్ లో వస్తుందని అధికారిక సమాచారం.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 15న దసరా స్పెషల్ గా ఉంటుందని తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం త్వరలోనే వచ్చే వీలుంది.