ఎక్స్ క్లూజివ్: రీమేక్‌ లో పవన్‌ తో గోపీచంద్‌

మలయాళ సూపర్‌ హిట్‌ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ ను తెలుగులో పవన్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ సినిమాలో మరో హీరోగా రానా నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. రానా కూడా రీమేక్‌ విషయమై తనతో చర్చ జరిపారు అంటూ పేర్కొన్నాడు. కాని ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు అన్నాడు. సాగర్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ రీమేక్‌ లో పవన్‌ తో పాటు మరో హీరోగా గోపీచంద్‌ ను కూడా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

గోపీచంద్‌ యాక్షన్‌ హీరోగా ఇప్పటికే మంచి పేరు దక్కించుకున్నాడు. దాంతో పాటు విలన్‌ గా కూడా గోపీచంద్‌ నటించి మెప్పించాడు. హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్న దర్శకుడు గోపీచంద్‌ ఈసారి పవన్‌ కళ్యాణ్‌ తో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడని సమాచారం అందుతోంది. అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ కోసం గోపీచంద్‌ ను సంప్రదించగా అందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. మొదట పవన్‌ పాత్రను పెంచి మరో హీరో పాత్రను తగ్గించాలని భావించారట. అయితే మలయాళంలో మాదిరిగానే ఇద్దరు హీరోలకు సమాన ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్‌ మరియు గోపీచంద్‌ లు హీరోలుగా ఈ సినిమా ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.