పూజా బాలీవుడ్‌ లో సెటిల్‌ అయినట్లేనా?

బాలీవుడ్‌ స్టార్స్‌ అంతా కూడా ఖరీదైన బాంద్రా ఏరియాలో ఇల్లు లేదా అపార్ట్‌ మెంట్‌ లో ఫ్లాట్‌ కొనుగోలు చేయడం చాలా కామన్‌ విషయం. ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే అక్కడ ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సౌత్‌ లో బిజీ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే బాలీవుడ్‌ కు మెల్ల మెల్లగా అడుగులు వేస్తుంది. అక్కడ బిజీ హీరోయిన్‌ గా మారిపోవాలని ఈమె భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

బాంద్రాలో సముద్రం ఫేసింగ్‌ తో ఫ్లాట్‌ ను కొనుగోలు చేసిన పూజా హెగ్డే ఇంటీరియర్‌ కోసం కూడా భారీగా ఖర్చు చేసిందట. ఈమె ప్రస్తుతం బాలీవుడ్‌ సినిమా షూటింగ్‌ కు వెళ్లిన సమయంలో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశ్యంతో అక్కడ ఫ్లాట్‌ కొనుగోలు చేసిందని అంటున్నారు. మరి ఈ అమ్మడు బాలీవుడ్‌ లో సెటిల్‌ అయ్యే ఉద్దేశ్యంతో అక్కడ ఫ్లాట్‌ కొనుగోలు చేసిందా లేదా అలా పడి ఉంటుందని అక్కడ ఫ్లాట్‌ ను కొనుగోలు చేసిందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఈమె మూడు సినిమాలను చేస్తుంది. రెండు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. మరో వైపు బాలీవుడ్‌ లో కూడా ఈమె సినిమాలు చేస్తు బిజీ బిజీగా ఉంది.