పూజా హెగ్డే కోసం ఆ ఇద్దరు హీరోల పోటీ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో ప్రభాస్‌ మరియు అఖిల్‌ ల చిత్రాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. అఖిల్‌ చిత్రం మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ ఇప్పటి వరకు షూటింగ్‌ పూర్తి అయ్యేది. కాని కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ వాయిదా పడినది. ఇదే సమయంలో ప్రభాస్‌ మూవీ కూడా ముగింపు దశకు వచ్చేది. కాని ఈ రెండు సినిమాలు కూడా మద్యలోనే ఉన్నాయి. షూటింగ్స్‌ కు అనుమతించిన వెంటనే ఈ రెండు సినిమాలను పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

షూటింగ్‌ ప్రారంభం అయిన వెంటనే తమకు డేట్లు ఇవ్వాంటూ రెండు సినిమాల మేకర్స్‌ ఇప్పటికే పూజా హెగ్డేను విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. జూన్‌ రెండవ లేదా మూడవ వారంలో ఈ రెండు సినిమాలకు పూజా హెగ్డే డేట్లు ఇవ్వాల్సి ఉంది. మరి రెండు సినిమాలకు ఒకేసారి పూజా హెగ్డే ఎలా డేట్లు ఇస్తుందో చూడాలి. రెండు సినిమాలు కూడా హైదరాబాద్‌ లోనే జరుగబోతున్నాయి. కనుక ఒక్క రోజులో రెండు సినిమాలకు డేట్లు అడ్జస్ట్‌ చేయవచ్చు అంటున్నారు.

వారంలో మూడు రోజులు ఒక సినిమాకు మరో సినిమాకు మూడు రోజులు డేట్లు ఇచ్చే అవకాశం ఉందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పూజా హెగ్డే కోసం ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటున్నారు. పూజా హెగ్డే తెలుగులో మాత్రమే కాకుండా హిందీలో కూడా సినిమా చేస్తుంది. మరి ఆ సినిమాకు ఎలా డేట్లు ఇస్తుందో చూడాలి.