బుట్టబొమ్మ చుక్కలు చూపిస్తోందిగా

సినిమా ఓ రంగుల ప్రపంచం ఎప్పుడు ఎవరి జాతకాలు తారుమారు అవుతాయో ఎవరూ చెప్పలేరు. అందుకే ప్రతీ ఒక్కరు క్రేజ్ వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తుంటారు. డిమాండ్ ని బట్టి భారీగా డిమాండ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని పాటిస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే.

తెలుగులో టాప్ హీరోయిన్ గా ట్రెండ్ అవుతున్న ఈ క్రేజీ హీరోయిన్ తనకున్న డిమాండ్ ని బట్టి భారీగానే ఆడుగుతోందట. ఇటీవల వరుసగా ఫ్లాప్ లని ఎదుర్కొన్నా క్రేజ్ తగ్గకపోవడం తనకు మించి హీరోలకు ఆప్షన్ లేకపోవడంతో ఈ టైమ్ ని తనకు అనుకూలంగా మార్చుకుంటోందట.

తను నటించిన రాధేశ్యామ్ బీస్ట్ ఆచార్య చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లుగా మారిన విషయం తెలిసిందే. దీంతో పూజా హెగ్డే పని అయిపోయిందని అన్నారంతా. ఆ వార్తలని నిజం చేస్తూ `ఎఫ్ 3`లోని ఓ ప్రత్యేక గీతంలో విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ లతో కలిసి ఆడిపాడింది పూజా హెగ్డే. ఈ నేపథ్యంలో ఇక తనకు తెలుగులో ఆఫర్లు లభించడం కష్టమే అని అన్నారంతా. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ పూరి జగన్నాథ్ – రౌడీ స్టార్ విజయ్ దేవరకొండల క్రేజీ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

`లైగర్` తరువాత పూరి జగన్నాథ్ – రౌడీ స్టార్ విజయ్ దేవరకొండల కాంబినేషన్ లో `జనగణమన` రూపొందుతున్నవిషయం తెలిసిందే. భారీ స్థాయిలో దేశ భక్తి ప్రధానంగా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా పూజా హెగ్డేని ఎంపిక చేశారు. ఈ భారీ చిత్రాన్ని చార్మితో కలిసి స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం పూజా హెగ్డేకు అందించిన రెమ్యునరేషన్ ఇప్పడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ దేవరకొండ హీరోగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న`జనగణమన` మూవీ కోసం పూజా హెగ్డేకు పారితోషికం కింద నాలుగు కోట్లు ఇవ్వడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుంగా ఆమె స్టాఫ్ కు కోటి ఖర్చు చేస్తుండం మరింతగా ఆశ్చర్యపరుస్తోంది. బుట్టబొమ్మ ఈ స్థాయిలో డిమాండ్ చేస్తూ ప్రొడ్యూసర్స్ కి చుక్కలు చూపించడానికి ప్రధాన కారణం తెలుగులో ఆమెకున్న క్రేజ్ తగ్గిపోవడమే. అంతే కాకుండా ఇప్పటికే ఇండస్ట్రీలో వున్న క్రేజీ స్టార్స్ అందరితో కలిసి నటించింది.

తను నటించడానికి ఇంకా హీరోలు ఎవరు మిగలలేదు. చిన్న హీరోలతో కలిసి నటించాలంటే వారు పూజని భరించడం కష్టం. దాంతో తన వద్దకు ఎవరైతే వస్తారో వారికి భారీగా డిమాండ్ చేస్తూ అందినంత దండుకోవాలనే ఫార్ములాని బుట్టబొమ్మ అప్లై చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ కారణంగానే భారీ గా పారితోషికాన్ని డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం పూజా హిందీలో రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. ఒకటి సల్మాన్ ఖాన్ నటిస్తున్న కబీ ఈద్ కబీ దివాళీ మరొకటి రణ్ వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న `సర్కస్`.