హ్యాట్రిక్ కొట్టాలని స్క్రిప్ట్ కూడా వినని బుట్టబొమ్మ

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అరవింద సమేత.. అల వైకుంఠపురం లో సినిమాల్లో హీరోయిన్ గా నటించి సక్సెస్ దక్కించుకున్న పూజా హెగ్డే ముచ్చటగా మూడవ సారి త్రివిక్రమ్ తో కలిసి వర్క్ చేయబోతుంది. ఖచ్చితంగా త్రివిక్రమ్ తో పూజా హెగ్డే హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. పూజా హెగ్డే కు కూడా మహేష్ తో చేయబోతున్న సినిమా పట్ల చాలా నమ్మకం కనిపిస్తుంది.

ఇప్పటికే రెండు సక్సెస్ లను ఇచ్చి ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్ గా తనను నిలబెట్టిన త్రివిక్రమ్ అంటే పూజా హెగ్డే కు చాలా గౌరవం పెరిగింది. అందుకే మహేష్ బాబుకు జోడీగా నటించబోతున్న సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు కథ వినలదేట. కనీసం పాత్ర ఎలా ఉంటుంది.. హీరోతో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయి.. నేపథ్యం ఏంటీ అనే విషయాన్ని కూడా తెలుసుకోలేదట. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా అది కూడా మహేష్ బాబుకు జోడీగా అనగానే ఓకే చెప్పిందట.

పారితోషికం విషయంలో కూడా పెద్దగా పట్టింపు లేకుండా మార్కెట్ రేట్ ప్రకారం.. తన గత సినిమాల రేటు ప్రకారం అన్నట్లుగా త్రివిక్రమ్ మూవీకి డేట్ లు కూడా ఇచ్చేసిందట. ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ ను పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. అన్ని అనుకున్నట్లు అయితే ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలలోనే సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ లతో గతంలో నటించి మెప్పించిన ఈ అమ్మడు మహేష్ బాబుతో సినిమా కోసం చాలా కాలం గా వెయిట్ చేస్తుంది. ఎట్టకేలకు అవకాశం దక్కింది. అందమైన ఈ అమ్మడికి వరుసగా భారీ సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. కథ నచ్చితేనే సినిమాకు కమిట్ అవుతాను అంటూ ఆమద్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మహేష్ బాబు సినిమా అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో అనడంతో కనీసం తన పాత్ర గురించి కూడా పూర్తిగా తెలుసుకోకుండా ఓకే చెప్పిందట. హ్యాట్రిక్ ఎలాగైనా త్రివిక్రమ్ తో కలిసి కొట్టాలని పూజా హెగ్డే భావించింది.

అందుకే ఆయన పై నమ్మకంతో ఈమద్య కాలంలో మహేష్ బాబు సినిమాలు ఆడుతున్న తీరుతో ఖచ్చితంగా విజయం సాధ్యం అని పూజా హెగ్డే భావించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా ఆమె నమ్మకంను ఎంత వరకు నిలుపుతుంది అనేది చూడాలి.