లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే అక్కడకు వెళ్తానంటున్న పూజా

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో పలు దేశాల్లో లాక్‌ డౌన్‌ను అమలు చేస్తున్నారు. ఇండియాలో కూడా గత నెలన్నర రోజులుగా లాక్‌డౌన్‌ అమలులో ఉంది. దాంతో సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. సెలబ్రెటీలు ఎప్పుడూ షూటింగ్స్‌ అని లేదంటే ఏదైనా ప్రమోషన్‌ కార్యక్రమాలంటూ బిజీ బిజీగా తిరిగే వారు కాస్త ఇంటికే పరిమితం అవ్వడంతో కాళ్లు కట్టేసినట్లుగా అవుతుందట. దాంతో ఎప్పుడెప్పుడు లాక్‌ ఎత్తేస్తారా బయట పడదామా అంటూ చాలా మంది ఎదురు చూస్తున్నారు.

ఇటీవల హాట్‌ బ్యూటీ పూజా హెగ్డే తన పోస్ట్‌ లాక్‌డౌన్‌ ప్లాన్‌ను తెలియజేసింది. లాక్‌ డౌన్‌ తర్వాత కూడా కొంత కాలం వరకు ఖచ్చితంగా విదేశాలకు ప్రయాణించడంపై ఆంక్షలు ఉంటాయి. కనుక ఇండియాలోనే హాలీడేకు వెళ్లాలని పూజా హెగ్డే నిర్ణయించుకుంది. కేరళలోని బెకల్‌ బీచ్‌కు వెళ్లాలని పూజా హెగ్డే భావిస్తుందట. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన వెంటనే ఈమె తన స్నేహితులతో ఆ బీచ్‌కు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చిందట. ఆ బీచ్‌ కేరళలోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రముఖ బీచ్‌ల్లో ఒకటి.

పూజా హెగ్డే ఆ బీచ్‌కు రెగ్యులర్‌గా వెళ్లేదట. ఈసారి అక్కడకు వెళ్లక చాలా రోజులు అయ్యింది కనుక వెంటనే వెళ్లాలనిపిస్తుందని చెప్పుకొచ్చింది. లాక్‌డౌన్‌ తర్వాత పూజా హెగ్డే మాత్రమే కాకుండా చాలా మంది స్టార్స్‌ కూడా హాలీడేకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి నుండే ఆ ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు. అయితే పూజా హెగ్డే మాత్రం అప్పుడే చెప్పేసింది. ఇంటికే పరిమితం అయ్యి బంధీగా ఉన్నట్లుగా ఉన్న సెలబ్రెటీలు అంతా కూడా వెంటనే హాలీడేకు వెళ్లబోతున్నారు. కాని ఈ లాక్‌డౌన్‌ ను మళ్లీ కొనసాగించే అవకాశం ఉన్న కారణంగా వారి ఆశలు అడియాశలు అవుతాయేమో చూడాలి.