దర్శకుడిపై పూనమ్‌ కౌర్‌ తీవ్ర వ్యాఖ్యలు

సోషల్‌ మీడియాలో హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ అప్పుడప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారంను రేపుతూ ఉంటాయి. ఈమె ఒక హీరో ఒక దర్శకుడిని టార్గెట్‌ చేస్తూ రెగ్యులర్‌గా పోస్ట్‌లు చేస్తూ ఉంది. పేర్లు బయటకు చెప్పకుండా వారి వల్ల తాను ఎదుర్కొన్న సమస్యలను గత అనుభవాలను నెమరేసుకుంటూ ఉంటుంది. ఇటీవల సుశాంత్‌ రాజ్‌ పూత్‌ మరణంతో మరోసారి స్టార్స్‌ తమ డిప్రెషన్‌ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో మంది స్టార్స్‌ డిప్రెషన్‌ తో మానసికంగా కృంగిపోతున్నారు. తాను కూడా డిప్రెషన్‌ కు వెళ్లి పోయాను. ఆ సమయంలో దర్శకుడు నా పట్ల చాలా అసభ్యంగా మాట్లాడాడు అంటూ పూనం కౌర్‌ వరుసగా ట్వీట్స్‌ చేసింది.

దర్శకుడి పేరు ఎత్తకుండా పూనం కౌర్‌ సోషల్‌ మీడియాలో… నా మానసిక పరిస్థితి బాగాలేదు, నాతో కొంత సమయం మాట్లాడండి ఏం చేయాలో అర్థం కావడం లేదు, ఆత్మహత్య చేసుకోవాలి అనిపిస్తుంది అంటూ ఆయనతో అన్నాను. ఆ సమయంలో ఆయన నవ్వుతూ చాలా లైట్‌గా నువ్వు చనిపోతే ఏమీ జరుగదు. ఒక రోజు న్యూస్‌ అవుతావు అంటూ ఎగతాలి చేశాడు. ఆ మాటలతో నా గుండె బద్దలు అయ్యింది. నన్ను ఇంకా ఆ సమయంలో చాలా మాటలు అన్నాడు. మీడియాలో ఆ సందర్బంగా నాపై చాలా చెడు కథనాలు వచ్చాయి. అవి నా ఆత్మవిశ్వాసంను దెబ్బ తీశాయి.

నాకు నేను సర్ది చెప్పుకుని నేను ఎందుకు ఇలా ఉండాలి, నేను బతికి చూపిస్తాను, ఆత్మహత్య చేసుకోవద్దు అంటూ ఇంకా కూడా నేను డిప్రెషన్‌కు సంబంధించి థెరఫీ తీసుకుంటున్నాను అంది. నా సినీ కెరీర్‌ను నిశబ్దంగా నాశనం చేశావు. నీవు గురూజీ కాదు, నీ వల్ల ఇండస్ట్రీలో కనీసం ఒక్కరు అంటే ఒక్కరికి కూడా లాభం చేకూరలేదు. స్నేహితులను కూడా మభ్యపెడుతూ నువ్వు మోసం చేస్తూ వస్తున్నావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈమె గురూజీ అంటూ సంభోధించింది కనుక ఈమె పోస్ట్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ గురించి అయ్యి ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేరు ప్రస్థావించకుండా ఆమె పోస్ట్‌లు చేసింది కనుక ఈ విషయంలో త్రివిక్రమ్‌ను బ్లేమ్‌ చేయడం కరెక్ట్‌ కాదని ఆయన అభిమానులు అంటున్నారు.