మనసులు గెలిచేస్తున్న చిరంజీవి

‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తారనగానే పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. క్లాస్‌ టచ్‌తో హోస్ట్‌ అంటే ఇలాగే వుండాలి అన్నట్టుగా నాగార్జున మొదటి మూడు సీజన్లలోను అదరగొట్టేయడంతో, దానిని మ్యాచ్‌ చేయడం చిరంజీవి వల్ల కాదని విమర్శలు వచ్చాయి.

చిరంజీవిలో నాటకీయత ఎక్కువని, నాగార్జునలా సహజంగా ఇంటరాక్ట్‌ కాలేడని కూడా అన్నారు. అయితే ఖైదీ నంబర్‌ 150 ఇచ్చిన వంద కోట్ల ఉత్సాహానికి తోడు, తన సహజసిద్ధమైన హాస్య చతురతని, ప్రజలతో కమ్యూనికేట్‌ కాగలిగే స్కిల్స్‌ని వాడుతూ చిరంజీవి అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ల నోళ్లు మూయించారు.

ఇంత కాలం కేవలం డిగ్నిఫైడ్‌ అండ్‌ థ్రిల్లింగ్‌ గేమ్‌గా వున్న దానిని చిరంజీవి ఎంటర్‌టైనింగ్‌గా మలుస్తున్నారు. అంతే కాకుండా షోలో పాల్గొంటున్న వారి కష్టాలకి స్పందించి, వారు కనుక అనుకున్న మొత్తం గెలుచుకోలేక పోతే తన సొంత అకౌంట్‌లోంచి వారికి డబ్బులిస్తూ చిరంజీవి మనసులు గెలిచేస్తున్నారు. కష్టాలకి స్పందించే గుణంతో పాటు మధ్య తరగతి కష్టాలేమిటి అనేది తెలిసిన వ్యక్తి కావడంతో చిరంజీవి ఈ షోకి పూర్తిగా కొత్త యాంగిల్‌ ఇస్తున్నారు.

ప్రస్తుతానికి చిరంజీవి అయితే ఈ షో హోస్ట్‌గా సూపర్‌హిట్‌. ఇక షో ఎంత హిట్‌ అనేది టీఆర్పీ రేటింగ్స్‌ బయటకి వస్తే కానీ తెలీదు. నాగార్జున మొదలు పెట్టిన కొత్తల్లో ఉన్నట్టుగా ఈ షోపై ఇప్పుడు జనాల్లో ఆసక్తి వుందా, లేదా అనేది టీఆర్పీలు చూస్తేనే తెలిసేది.