రెండు భాగాలుగా విడుదల కానున్న ప్రభాస్ సలార్

భారీ ప్యాన్ ఇండియా చిత్రాలకు ఈ ట్రెండ్ కచ్చితంగా మారుతున్నట్లుంది. బాహుబలి, పుష్ప, కేజిఎఫ్ చిత్రాల తర్వాత ఇప్పుడు సలార్ కూడా రెండు భాగాలుగా విడుదల కానుంది. గత కొంత కాలం నుండి రూమర్ గా మొదలైన వార్త ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. సలార్ మొదటి పార్ట్ ను 2023లో విడుదల చేయనున్నారు.

ప్రభాస్ కు ఈ ఏడాది రెండు రిలీజ్ లు ఉన్నాయి. రాధే శ్యామ్ మార్చ్ లో విడుదలవుతోంది. ఆది పురుష్ లో ఆగస్ట్ లో విడుదలవుతుంది. ఇక 2023లో సలార్ విడుదలవుతుంది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే తిరిగి మొదలవుతుంది.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కేజిఎఫ్ ఫేమ్ హోంబేలె ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. కేజిఎఫ్ కు పనిచేసిన కీలక సాంకేతిక బృందం సలార్ కు కూడా పనిచేస్తుండడం విశేషం.