లాక్ డౌన్ లో లుక్ మార్చేసిన టాలీవుడ్ స్టార్స్..

కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ ను మన తెలుగు హీరోలు చక్కగా సద్వినియోగం చేసుకున్నారనే చెప్పాలి. ఫ్యామిలీ ఎంజాయ్ మెంట్, కొత్త కథలతోపాటు మేకోవర్, బాడీ ఫిట్ నెస్ పై కూడా దృష్టి పెట్టారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, మహేశ్, అల్లు అర్జున్.. చక్కని మేకోవర్ లోకి మారిపోయారు. వీరంతా తమ న్యూలుక్స్ తో ఆకట్టుకున్నారు. రీసెంట్ టైమ్స్ లో వారి న్యూ లుక్స్ సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో తెలిసిన విషయమే.

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి మీసం తీసేసి.. మరోసారి ఏకంగా గుండు లుక్ తో సంచలనం రేపారు. వయసు పెరిగినా పాత్రలపై ఆయనకున్న కమిట్ మెంటే ఇందుకు ఉదాహరణ అంటూ మెగాభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక స్లిమ్ లుక్ లో ఆయన ఫొటోలు తెగ వైరల్ అయ్యియి. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చే నాగార్జున తన ఫిట్ నెస్ లెవల్స్ ఎంతో మరోసారి నిరూపించారు. మహేశ్ అయితే.. వర్కౌట్స్ చేస్తూ.. ఫ్రెష్ లుక్ లోకి ఎలా మారిపోయారో చూస్తూనే ఉన్నాం. మరింత యవ్వనంగా తయారవుతున్న సూపర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

సినిమా సినిమాకు లుక్ మార్చే అల్లు అర్జున్ పుష్ప కోసం రఫ్ లుక్ లోకి మారిపోయారు. బన్నీ చాలా స్టైలిష్ గా కనిపించడం విశేషం. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ కోసం తమ పాత లుక్ నే కాపాడుకుంటున్నారు. పవన్ కల్యాణ్, ప్రభాస్, వరుణ్ తేజ్, నితిన్, నిఖిల్, సుధీర్, సందీప్ కిషన్.. ఇలా వీరంతా ఫుల్ ఫిట్ నెస్ కాపాడుకుంటూ లాక్ డౌన్ టైమ్ ను బాగానే సద్వినియోగం చేసుకున్నారు.