ఎక్స్ క్లూజివ్: ప్రభాస్‌ వెంట పడుతున్న ఆ ముగ్గురు

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ఆల్‌ ఇండియా స్టార్‌ హీరో అనడంలో సందేహం లేదు. బాహుబలి మరియు సాహో సినిమాలో ప్రభాస్‌ స్టార్‌ డం అమాంతం పెరిగింది. ప్రభాస్‌ తో సినిమా కోసం పదుల సంఖ్యలో నిర్మాణ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కరణ్‌ జోహార్‌ వంటి ప్రముఖ నిర్మాత హిందీలో ప్రభాస్‌ తో సినిమాను చేసేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. కాని ప్రభాస్‌ మాత్రం ఇప్పటి వరకు కరణ్‌ జోహార్‌ కు ఓకే చెప్పలేదు. ఇక గతంలో ప్రభాస్‌ తో సినిమాను నిర్మించిన దిల్‌ రాజు ఇప్పుడు ఆయనతో ఒక సినిమాను నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నాడు. దాంతో రెగ్యులర్‌ గా ప్రభాస్‌ తో టచ్‌ లో ఉంటున్నాడు.

దిల్‌ రాజుకు తప్పకుండా డేట్లు ఇస్తానంటూ ప్రభాస్‌ హామీ ఇచ్చాడట. ఇక ఈమద్య కాలంటో టాలీవుడ్‌ లో అందరు స్టార్‌ హీరోలతో సినిమాలు నిర్మించేందుకు సిద్దం అవుతున్న మైత్రి మూవీ మేకర్స్‌ కు కూడా ప్రభాస్‌ డేట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడట. మైత్రి మూవీ మేకర్స్‌ వారు చాలా సినిమాలను ప్రస్తుతం లైన్‌ లో పెట్టారు. ప్రభాస్‌ తో కూడా సినిమా చేయాలని వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో 14 రీల్స్‌ బ్యానర్‌ వారు కూడా ప్రభాస్‌ తో సినిమాకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ మూడు నిర్మాణ సంస్థలకు ప్రభాస్ ఓకే చెప్పాడు అనే ప్రచారం జరుగుతోంది. బాహుబలి తర్వాత సాహోను యూవీ క్రియేషన్స్‌ లో నటించిన ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న రాధేశ్యామ్ కూడా యూవీ క్రియేషన్స్‌ లోనే అనే విషయం తెల్సిందే. ఆది పురుష్‌ మూవీ టీ సిరీస్‌ బ్యానర్‌ లో కాగా, నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో సినిమా కు వైజయంతి మూవీస్‌ వారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత సినిమాల కోసం ప్రభాస్‌ వెంట వీళ్లు పడుతున్నారు. మరి ప్రభాస్‌ 2022లో వీళ్లలో ఎవరికి ఓకే చెప్తాడు అనేది చూడాలి.