ప్రభాస్ ఆది పురుష్ సెట్ లో భారీ అగ్ని ప్రమాదం

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం ఆది పురుష్. ఈ సినిమా షూటింగ్ ఈరోజు మొదలైందని అధికారికంగా తెలియజేసారు. తన్హాజి చిత్రాన్ని తెరకెక్కించిన ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ప్రసాద్ సుతార్, భూషణ్ కుమార్ లో నిర్మిస్తున్నారు. భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఉపయోగించి మొత్తం 3డి లో చిత్రీకరించనున్నారు.

ఇక ఈరోజే సినిమా షూటింగ్ మొదలవ్వగా దురదృష్టవశాత్తూ మొదలైన కొద్ది గంటలకే భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే సెట్ లో ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ వంటి ప్రముఖులు ఉన్నారో లేదో ఇంకా తెలియలేదు కానీ మూవీ సెట్ కు మాత్రం భారీగా నష్టం చేకూరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంటలను అదుపుచేశారు. కానీ నష్టం మాత్రం అధికంగా ఉందని సమాచారం.

అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆది పురుష్ చిత్రాన్ని ఆగస్ట్ 11 2022న విడుదల చేస్తారని అధికారికంగా తెలియజేసారు.