తన భార్యను పరిచయం చేయనున్న ప్రభుదేవా

కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు ప్రభుదేవా రీసెంట్ గా రెండో వివాహం చేసుకున్నాడన్న వార్తలు షికార్లు చేస్తున్న విషయం తెల్సిందే. రీసెంట్ గా ప్రభుదేవా తమ్ముడు రాజు సుందరం మాట్లాడుతూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసాడు కూడా. మేలో ప్రభుదేవా ఫీజియోతెరపిస్ట్ డా! హిమానీను వివాహం చేసుకున్నట్లు తెల్సింది.

తన బ్యాక్ మరియు లెగ్స్ ట్రీట్మెంట్ కోసం ముంబైలో ఒక ఫిజియోతెరపి హాస్పిటల్ ను సందర్శించగా అక్కడ హిమానీతో పరిచయం ఏర్పడడం, వారి మధ్య బంధం బలపడడం జరిగిందట. మార్చ్ లో వివాహం నిమిత్తం హిమానీ చెన్నైకు రాగా కరోనా కారణంగా అది సాధ్యపడలేదు. ఫైనల్ గా మేలో వీరి వివాహం జరిగింది.

తాజా సమాచారం ప్రకారం తెలుస్తున్న విషయం ఏమిటంటే ప్రభుదేవా ఒక ప్రెస్ కాన్ఫెరెన్స్ పెట్టి తన భార్యను అందరికీ పరిచయం. చేస్తాడట. అయితే అది ఎప్పుడు అనేది ఇంకా తెలియలేదు.

ఇది ప్రభుదేవాకు రెండో వివాహమన్న విషయం తెల్సిందే. మొదటి భార్య రమాలతకు డివోర్స్ ఇచ్చాడు ప్రభుదేవా. వీరికి ఇద్దరు సంతానం. కొన్నేళ్ల క్రితం నయనతారతో రిలేషన్ లో ఉన్న విషయం కూడా తెల్సిందే. ఆ బ్రేకప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రభుదేవా వివాహం జరిగింది.