‘పుష్ప’ విలన్ పారితోషికం ఎంతో తెలుసా?

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్న పుష్ప సినిమా షూటింగ్‌ స్పీడ్‌ గా సాగుతోంది. ఆగస్టులో సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇటీవలే ఈ సినిమా లో ప్రధాన విలన్ గా ఫాహద్‌ ఫాసిల్ ను నటింపజేస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మలయాళ నటుడే అయినా కూడా ఫాహద్‌ కు పాన్ ఇండియా గుర్తింపు ఉంది. కనుక ఆయన్ను ఈ సినిమాలో నటింపజేయడం వల్ల ఖచ్చితంగా సినిమా మార్కెట్‌ పెరుగుతుందని అంటున్నారు.

పుష్ప సినిమా లో నటిస్తున్నందుకు గాను ఫాహద్‌ ఫాసిల్ కు మైత్రి వారు ఏకంగా రూ.5 కోట్ల రూపాయలు అదనంగా ట్యాక్స్‌ లను కూడా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రేంజ్‌ లో ఇటీవల ఏ తెలుగు విలన్ పారితోషికంగా తీసుకుని ఉండరు అంటున్నారు. హీరో బన్నీ మరియు దర్శకుడు సుకుమార్‌ తర్వాత ఈయన పారితోషికం అత్యధికంగా చెబుతున్నారు. మలయాళంలో మరియు ఉత్తరాదిన ఫాహద్ కు మంచి గుర్తింపు ఉన్న కారణంగా అక్కడ మంచి బిజినెస్ చేస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.