డ్రగ్స్ వివాదంలో అరెస్టైన కన్నడ నటికి బెయిల్ మంజూరు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శాండల్ వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో కీలక మలుపు ఈరోజు చోటు చేసుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన రాగిణి ద్వివేది ఈ డ్రగ్స్ కుంభకోణంలో అరెస్టైన విషయం తెల్సిందే. రాగిణి ద్వివేదికు ఈరోజు సుప్రీమ్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

గతేడాది సెప్టెంబర్ 4న రాగిణి ద్వివేది అరెస్టయింది. ఈ నటికి డ్రగ్ డీలర్స్ తో సంబంధాలున్నాయని పోలీసులు అనుమానించారు. ఆమె ఇంటిని సోదా చేయగా పోలీసులు గంజాయి నింపిన సిగరెట్లను భారీ సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. ఆమె సెల్ ఫోన్లను కూడా సీజ్ చేసారు. ఈమెతో పాటు నటి సంజనాను కూడా ఇదే కేసులో అరెస్ట్ చేసారు. తెలుగులో ప్రభాస్ సరసన బుజ్జిగాడు సినిమాలో నటించింది సంజనా. అయితే ఆమెకు ఇదివరకే బెయిల్ మంజూరైంది. ఇప్పుడు రాగిణికు కూడా బెయిల్ ను మంజూరు చేసారు.