అమెరికా వెళ్లి పోయిన నవీన్ పొలిశెట్టిపై రాహుల్‌ ఆగ్రహం

నవీన్ పొలిశెట్టి హీరోగా రాహుల్‌ రామకృష్ణ మరియు ప్రియదర్శిలు కీలక పాత్రల్లో నటించిన జాతి రత్నాలు సినిమా సూపర్‌ డూపర్‌ హిట్ అయ్యింది. విడుదలై వారం దాటినా కూడా మంచి వసూళ్లు ఈ సినిమాకు నమోదు అవుతున్నాయి. ఈ వీకెండ్‌ లో చిత్ర యూనిట్‌ సభ్యులు అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్కడ థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులను పలకరించేందుకు గాను నవీన్ పొలిశెట్టి మరియు ప్రియదర్శిలు వెళ్లారు. అయితే తనను తీసుకు వెళ్లలేదు అంటూ వారిద్దరిపై సినిమాలో నటించిన రాహుల్‌ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

అరే దర్శి.. నవీన్‌ పీపుల్స్ ప్లాజా సక్సెస్ మీట్‌ అయ్యేలోపు మిమ్మల్ని కలిసేలోపు పాస్ పోర్ట్‌తో ఎయిర్‌ పోర్ట్‌ కు వెళ్లి విమానం ఎక్కి యూఎస్‌ వెళ్లిపోతారేరా. నా దగ్గర కూడా పాన్ కార్డ్‌ ఉందని చెప్పాను కదరా. పాన్ కార్డ్‌ చూపిస్తే నన్ను కూడా రానిచ్చేవారు కదరా. నావల్లే ప్రాబ్లమ్‌ అవుతుందని నన్ను తీసుకు వెళ్లలేదు కదరా మీ సంగతి వచ్చిన తర్వాత చెప్తా అంటూ సరదా వీడియోను రాహుల్‌ షేర్‌ చేశాడు. వీరి సినిమా భారీ వసూళ్లను రాబట్టడంతో పాటు వీరు ముగ్గురు కూడా మంచి ఫేమస్ అయ్యారు.