రజినీకాంత్‌కు కరోనా పాజిటివ్‌

బాలీవుడ్‌ నటుడు రోహిత్‌ రాయ్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో రజినీకాంత్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది, ప్రస్తుతం క్వారెంటైన్‌ కేంద్రంలో ఉన్నాడు అంటూ పోస్ట్‌ చేశాడు. అతడు ఏ రజినీకాంత్‌ను ఉద్దేశించి పోస్ట్‌ చేశాడో కాని అతడు నలుగురు ఈ విషయంలో అవైర్‌నెస్‌ను తెచ్చుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని పని మీద బయటకు వెళ్లి వస్తే వెంటనే చేతులు శానిటైజేషన్‌ చేసుకోవాలని సూచించాడు. అతడి సూచన బాగానే ఉన్నా రజినీకాంత్‌ అంటూ పేరు పెట్టడంతో ఇప్పుడు సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ రెచ్చి పోతున్నారు.

రజినీకాంత్‌కు కరోనా అంటూ అతడు పెట్టిన పోస్ట్‌తో ఒక్కసారిగా రజినీకాంత్‌ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం ఆందోళన చెందారు. కొందరు అయితే సూపర్‌ స్టార్‌ రజినీకంత్‌కు నిజంగానే కరోనా వచ్చిందేమో అంటూ ఆందోళన వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. మొత్తానికి అసలు విషయం ఏంటీ అంటే రజినీకాంత్‌కు కరోనా ఏమీ లేదు. అసలు రజినీకాంత్‌కు కనీసం కరోనా టెస్టులు కూడా నిర్వహించలేదు అంటూ తమిళ మీడియా నిర్థారించింది.

రోహిత్‌ రాయ్‌ పోస్ట్‌ చేసింది మరో రజినీకాంత్‌కు అయ్యి ఉంటుందని అంటున్నారు. అయితే రజినీకాంత్‌ పేరు పెడితే ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించవచ్చు అనే ఉద్ధేశ్యంతో ఆయన ఇలాంటి పోస్ట్‌ పెట్టి ఉంటాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం కరోనా అనేది మనుషుల జీవితాల్లో భాగం అయ్యింది. కనుక రజినీకాంత్‌కు కరోనా అనగానే నిజమే అయ్యి ఉంటుందని చాలా మంది భావించి ఉండవచ్చు.