రకుల్‌కు మరో ‘బి’ ఆఫర్‌

టాలీవుడ్ లో జోరు తగ్గిన రకుల్‌ ప్రీత్‌ సింగ్ కు బాలీవుడ్‌ నుండి పిలుపు అందుతుంది. ఇప్పటికే ఈ అమ్మడు అక్కడ దే దే ప్యార్‌ దే అనే సినిమా లో నటించి మెప్పించింది. అజయ్‌ దేవగన్ తో ఈ అమ్మడి రొమాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. మళ్లీ ఆయనతో సినిమాకు రకుల్‌ కు ఆఫర్‌ దక్కింది. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో రూపొందబోతున్న థ్యాంక్యూ గాడ్‌ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

అజయ్‌ దేవగన్ మరియు సిద్దార్థ మల్హోత్రాలు హీరోలుగా నటించబోతున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌ గా కనిపించబోతుంది. ఈ సినిమా పై రకుల్‌ చాలా అంచనాలు పెట్టుకుంది. తెలుగు మరియు తమిళంలో ఆఫర్లు తగ్గుతున్న ఈ సమయంలో బాలీవుడ్‌ లో వరుసగా రెండు ఆఫర్లు రావడంతో రకుల్‌ అక్కడ బిజీ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. ఈ ఏడాదిలో రకుల్‌ నటిస్తున్న మొత్తం నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలు సక్సెస్ అయితే రకుల్‌ వచ్చే ఏడాది మరింతగా బిజీ అయ్యే అవకాశం ఉంది.